ఫుట్‌బాల్ ఆటగాళ్లపై వ్యక్తి దాడి


నాంపల్లి: ఫుట్‌బాల్ ఆడుతున్న ముగ్గురిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ముగ్గురిలో ఇద్దరు బాలురు ఉన్నారు. ఈ సంఘటన గురువారం నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రెడ్‌హిల్స్ గ్రౌండ్ సమీపంలో ఇస్రాఉద్దీన్‌తో పాటు మరో ఇద్దరు పిల్లలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఈ క్రమంలో బంతి ఖాజా మోహినుద్ధీన్ అనే వ్యక్తి ఇంటి గేటుకు తగిలింది.



బంతి గేటుకు తగలగానే ఖాజామోహినుద్ధీన్ బయటకు వచ్చి ఆట ఆడుతున్న ఇస్రాఉద్ధీన్‌తో పాటు మరో ఇద్దరు చిన్నారులపై కట్టెతో దాడిచేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ముగ్గురిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top