మహేంద్ర సింగ్ ధోనీ @ 34
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే, టీ-20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 35వ ఏట అడుగుపెట్టారు. మంగళవారం ధోనీ తన 34వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు.
బర్త్ డే బాయ్ ధోనీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీసీసీఐ, ఐసీసీ, సహచర, విదేశీ క్రికెటర్లు ధోనీకి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే' ధోనీ అంటూ బీసీసీఐ, ఐసీసీ ట్వీట్ చేశాయి. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, అజింక్యా రహానె, సురేష్ రైనా,ప్రజ్ఞాన్ ఓఝా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.