ధోని కేసు ఆగస్టు 1కి వాయిదా

ధోని కేసు ఆగస్టు 1కి వాయిదా


అనంతపురం లీగల్ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనిని మహావిష్ణువుగా చిత్రీకరిస్తూ బిజినెస్ టుడే కవర్‌పేజీపై ప్రచురించిన కేసులో అనంతపురం షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక న్యాయ స్థానంలో శుక్రవారం విచారణ ప్రారంభమైంది.

 

  మేగజైన్ తరఫు న్యాయవాది యజ్ఞదత్ తన సమాధానాలను లిఖితపూర్వకంగా దాఖలు చేయడంతో.. వీటిపై స్పందించేందుకు పిటిషనర్ శ్యాం సుందర్ తరఫు న్యాయవాది గడువు కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. ఈ కేసులో ధోని తరఫు న్యాయవాదులు కూడా హాజరయ్యారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top