'మహా లీగ్' కు రంగం సిద్ధం!


షిల్లాంగ్: ఇప్పటికే క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్,టెన్నిస్,బాడ్మింటన్ తదితర లీగ్ లను చూసిన మనకు మరో లీగ్ కనువిందు చేయనుంది. త్వరలో టేబుల్ టెన్నిస్ లో కూడా లీగ్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది.  మే 28 నుంచి ముంబై వేదికగా టీటీ  లీగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన విషయాలను టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ధన్‌రాజ్ చౌదరి శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.  ఈ లీగ్ ను ‘‘టీటీ మహా లీగ్’’ పేరుతో అభిమానుల ముందుకు తీసుకొస్తున్నట్లుప్రకటించారు. ఇందులో 8 ఫ్రాంఛైజీలు జట్లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. భారత్ ఫేమస్ టీటీ ఆటగాడు ఆచంట శరత్ కమల్  ఈ లీగ్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనునన్నట్లు ధనరాజ్ తెలిపారు.



ఒక్కో జట్లులో 4 గురు స్వదేశీ, 4 గురు విదేశీ ఆటగాళ్లు ఉంటారు. విజేత ప్రైజ్ మనీ రూ.1 కోటీ. దేశంలోని ఎనిమిది ఫ్రాంఛైజీ నగరాల్లో (హైదరాబాద్,బెంగళూర్,చెన్నై,కొలకత్తా,ఢిల్లీ, అహ్మదాబాద్,జైపూర్,ముంబై) ఈ టోర్నీ జరగనుంది. మే 28-జూన్22 వరకు కొనసాగుతుంది. ముంబైకి చెందిన 11 ఈవెన్ అనే స్పోర్ట్స్ సంస్థ ఈ టోర్నీను నిర్వహించనుంది. దీనిలో భాగంగా 10 ఏళ్ల పాటు టోర్నీ నిర్వహణకు సంబంధించిన  ఒప్పందాన్ని కుదుర్చుకొంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top