లెజెండ్‌ జట్టుకు టైటిల్‌

లెజెండ్‌ జట్టుకు టైటిల్‌


సాక్షి, హైదరాబాద్‌: కాప్రస్‌ ఐటీ బీఎన్‌ఐ క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో లెజెండ్‌ జట్టు విజేతగా నిలిచింది. కొంపల్లిలో డైమండ్‌ జట్టుతో సోమవారం జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న డైమండ్‌ జట్టు 18.4 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది.


 


శరద్‌ చంద్ర (20) టాప్‌ స్కోరర్‌. కేఆర్‌కే రెడ్డి 3 వికెట్లతో చెలరేగగా... రథన్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 94 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన లెజెండ్‌ జట్టు 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసి గెలిచింది. సుధీర్‌ (36) ధాటిగా ఆడాడు. డైమండ్‌ బౌలర్లలో జార్జ్‌ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.





 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top