సన్నద్ధం కాకుండానే...

సన్నద్ధం కాకుండానే...


* ‘రియో’లో పేస్-బోపన్న జంట

* వైఫల్యంపై భూపతి అభిప్రాయం  


ముంబై: ఎలాంటి సన్నాహాలు లేకుండా రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నందుకే లియాండర్ పేస్-రోహన్ బోపన్న జంట తొలి రౌండ్‌లోనే నిష్కమ్రించిందని భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి అభిప్రాయపడ్డాడు. ‘పేస్-బోపన్న  కలసి సాధన చేయలేదు.  మేమిద్దరం ఏథెన్‌‌స, బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆడిన సమయంలో పలు టోర్నమెంట్లలో కలిసి ఆడాం.  కానీ పేస్-బోపన్న అలా చేయలేదు. ఫలితంగా పురుషుల డబుల్స్‌లో పతకంపై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్న-సానియా జంటకు పతకం నెగ్గే అవకాశం లభించినా వదులుకున్నారు’ అని ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా భూపతి వ్యాఖ్యానించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top