'అందుబాటులో ఉండే క్రికెటర్ల పేర్లు ఇవ్వండి'
కొలంబో:శ్రీలంక క్రికెట్ బోర్డుకు- ఆటగాళ్లకు మధ్య నెలకొన్నకాంట్రాక్టు మ్యాచ్ ల రగడ ఇప్పట్లో కొలిక్కి వచ్చేటట్టు కనిపించడం లేదు. ఇప్పటికే కొంతమంది శ్రీలంక ఆటగాళ్లు పలు లీగ్ మ్యాచ్ ల్లో ఆడేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో..రాబోయే టూర్లకు ఆటగాళ్లను ఎంపిక చేయడంపై శ్రీలంక బోర్డు తర్జనభర్జనలు పడుతోంది. వచ్చే ఇంగ్లండ్-ఐర్లాండ్ టూర్లకు అందుబాటులో ఉండే వారి వివరాలు ఇవ్వాలంటూ బోర్డు స్వయంగా ఆటగాళ్లను కోరింది. మే 6వ తేదీ నుంచి శ్రీలంక పర్యటించే విదేశీ టూర్లకు గాను ఆటగాళ్లు వివరాలను అందించాలంటూ చీఫ్ సెలెక్టర్ సనత్ జయసూర్య కోరాడు.
తొలుత ఐర్లాండ్ టూర్ కు వెళుతున్న శ్రీలంక మే 6, మే 8వ తేదీల్లో రెండో వన్డేలు ఆడుతుంది. . అనంతరం ఇంగ్లండ్ కు పయనమై ముందుగా రెండు ట్వంటీ 20 మ్యాచ్ ల్లో పాల్గొంటుంది. తరువాత ఐదువన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ ల్లో తలపడుతుంది.ఇప్పటికే లసిత్ మలింగా, తిషారా పెరీరాలు ఐపీఎల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ కీలక దశకు చేరుకున్న తరుణంలోనే శ్రీలంక టూర్ ఉండటంతో వారు అందుబాటులోకి వస్తారా?లేదా? అనే దానిపై బోర్డు ఆచితూచి ఆడుగులు వేస్తోంది. ఒకవేళ ఆ ఇద్దరు ఆటగాళ్లు శ్రీలంక టూర్ కు అందుబాటులో ఉండకపోతే వారు ఐపీఎల్ లో ఫ్రీగా ఆడే అవకాశం ఉందని సనత్ తెలిపాడు.