ఆ ముగ్గురికి ఐసీసీ క్లీన్‌చిట్


దుబాయ్: ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లు భారీ స్థాయిలో ముడుపులు స్వీకరించారన్న లలిత్ మోదీ ఆరోపణలను ఐసీసీ తోసిపుచ్చింది. వారు అలాంటి పనికి పాల్పడినట్టుగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని స్పష్టం చేసింది. సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో తలా రూ.20 కోట్లను ఓ పారిశ్రామిక వేత్త నుంచి స్వీకరించినట్టు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోది ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా ఇప్పుడు ముగిసిన వ్యవహారమని, ఆ విషయంపై పూర్తి స్థాయిలో పరిశోధన చేశామని ఐసీసీ తెలిపింది.  మరోవైపు లలిత్ మోదీపై ముగ్గురు క్రికెటర్లు పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తమ ఆటగాళ్లపై మోదీ చేసిన బెట్టింగ్ ఆరోపణలపై బీసీసీఐ కూడా స్పందించింది. ఆ ఆటగాళ్లు తప్పు చేసినట్టుగా ఏమీ రుజువు కాలేదని తేల్చింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top