లంకకు చేరిన కోహ్లి సేన


కొలంబో: మూడు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత టెస్టు జట్టు  శ్రీలంకలో అడుగుపెట్టింది. సోమవారం బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన జట్టు సభ్యులకు ఘనస్వాగతం లభించింది. అనంతరం ఆటగాళ్లంతా తాము బస చేసే హోటల్‌కు వెళ్లిపోయారు. ఈ పర్యటనలో భాగంగా జట్టు ఈనెల 12 నుంచి సెప్టెంబర్ 1 వరకు మూడు టెస్టులను ఆడనుంది. అంతకంటే ముందు శ్రీలంక బోర్డు ఎలెవన్‌తో 6 నుంచి 8 వరకు కొలంబోలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top