రెండో ర్యాంకుకు కోహ్లి
దుబాయ్: సూపర్ సెంచరీతో తిరిగి ఫామ్లోకి వచ్చిన బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరుకున్నాడు. డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) అగ్రస్థానంలో ఉండగా హషీమ్ ఆమ్లా మూడో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ ఎంఎస్ ధోని ఆరో స్థానంలోనే కొనసాగుతుండగా... ధావన్ ఒక స్థానం తగ్గి ఎనిమిదికి చేరాడు.
ఇక బౌలింగ్ విభాగంలో పేసర్ భువనేశ్వర్ ఏడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. జడేజా ఐదు నుంచి ఆరో స్థానానికి పడిపోయాడు. మహ్మద్ షమీ కెరీర్లో తొలిసారిగా టాప్-20 (16వ ర్యాంకు)లోకి చేరాడు. వన్డేల్లో భారత్ రెండో ర్యాంకు మారలేదు. బుధవారం నుంచి కివీస్తో జరిగే మూడు వన్డేల సిరీస్ను 3-0తో నెగ్గితే దక్షిణాఫ్రికా.. ఆసీస్ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంకులోకి వెళుతుంది.