జాదవ్, శామ్సన్ అర్థ సెంచరీలు


డార్విన్: కేదార్ జాదవ్, సంజూ శామ్సన్ రాణించడంతో ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్ పెర్మారెన్స్ స్క్వాడ్(ఎన్పీఎస్)పై భారత్ 'ఎ' జట్టు విజయం సాధించింది. మంగళవారమిక్కడ జరిగిన వన్డేలో 3 వికెట్ల తేడాతో ఎన్పీఎస్ ను ఓడించింది. ఎన్పీఎస్ నిర్దేశించిన 235 పరుగుల లక్ష్యాన్ని 61 బంతులు మిగులుండానే అధిగమించింది. 39.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది.



జాదవ్(87), శామ్సన్(55) అర్థ సెంచరీలు సాధించారు. జాదవ్ 53 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. ఊతప్ప 17, వోహ్రా 25, ఆర్ ధావన్ 22 పరుగులు చేశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఎన్పీఎస్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top