రాణించిన రాయుడు, జాదవ్

రాణించిన రాయుడు, జాదవ్ - Sakshi


డార్విన్: తెలుగు కుర్రాడు అంబటి రాయుడు, కేదార్ జాదవ్ అర్థ సెంచరీలు సాధించడంతో నాలుగు దేశాల సిరీస్‌లో భారత్-ఎ ఐదో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా-ఎ జట్టును భారత్ 5 వికెట్ల తేడాతో ఓడించింది.



ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్ మనోజ్ కుమార్ తివారి 5 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. రాయుడు 77, జాదవ్ 42, శామ్సన్ 49, పర్వేజ్ రసూల్ 20, ఊతప్ప 13 పరుగులు చేశారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top