భారత మహిళల ఇన్నింగ్స్ విజయం
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు
మైసూర్: దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో ఫాలోఆన్ ఆడుతూ...ఓవర్నైట్ స్కోరు 83/6తో బుధవారం ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా 78.2 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. త్రిషా చెట్టి (35), క్లో ట్రయాన్ (30 నాటౌట్) ఏడో వికెట్కు 53 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
12 పరుగుల తేడాతో ఆ జట్టు చివరి 4 వికెట్లు కోల్పోవడం విశేషం. భారత బౌలర్లలో హర్మన్ప్రీత్ కౌర్కు 4 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్లో హర్మన్ (9/85) భారత్ తరఫున టెస్టుల్లో రెండో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. టెస్టులో 10 వికెట్లు తీసిన భారత బౌలర్ (10/78) రికార్డు జులన్ గోస్వామిది.
సంక్లిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్ 400/6 డిక్లేర్డ్, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 234, రెండో
ఇన్నింగ్స్ 132.