ప్రిక్వార్టర్స్‌లో జ్వాల జోడీ


న్యూఢిల్లీ: జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో జ్వాల-అశ్విని జోడీ 21-17, 21-16తో సుసీ రిజ్కీ అందిని-మరెతా గియోవాని (ఇండోనేసియా) ద్వయంపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

 

  పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరవింద్ భట్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో అరవింద్ 21-10, 24-22తో ప్యాట్రిక్ కెమ్‌నిట్జ్ (జర్మనీ)పై గెలిచాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top