జో రూట్ డబుల్ సెంచరీ

జో రూట్ డబుల్ సెంచరీ


తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 589/8డిక్లేర్డ్ 

పాక్‌తో రెండో టెస్టు


మాంచెస్టర్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ (406 బంతుల్లో 254; 27 ఫోర్లు) కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152.2 ఓవర్లలో 8 వికెట్లకు 589 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్వదేశంలో పాక్‌పై డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచిన రూట్.. ఏడో వికెట్‌కు బెయిర్‌స్టో (81 బంతుల్లో 58; 7 ఫోర్లు)తో కలిసి 106 పరుగులు జత చేశాడు. క్రిస్ వోక్స్ (104 బంతుల్లో 58; 8 ఫోర్లు; 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వహాబ్‌కు మూడు, ఆమిర్, రాహత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ కడపటి వార్తలందేసరికి 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో మసూద్ (12 బ్యాటింగ్), అజహర్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top