ఆగస్ట్ 1న అండర్సన్ విచారణ
జడేజాతో తొలి టెస్టు వివాదం
లండన్: భారత్తో టెస్టు సిరీస్లో వెనుకబడిన ఇంగ్లండ్కు మరో వైపు కాస్త ఊరట లభించింది. తొలి మ్యాచ్లో జడేజాతో జరిగిన గొడవకు సంబంధించి ఆ జట్టు పేసర్ జేమ్స్ అండర్సన్ విచారణ ఆగస్ట్ 1న జరగనుంది. ఫలితంగా అండర్సన్కు మూడో టెస్టులోనూ పాల్గొనే అవకాశం దక్కింది. ఈ నెల 27నుంచి 31 వరకు సౌతాంప్టన్లో మూడో టెస్టు జరుగుతుంది. ఈ వివాదంపై లెవెల్ 3 అభియోగం ఎదుర్కొంటు న్న అండర్సన్ను..1న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయీస్ విచారిస్తారు. మంగళవారం లూయీస్ ప్రాథమిక వాదనలు విన్నారు.
బీసీసీఐ, ఈసీబీ న్యాయ నిపుణులు, అండర్సన్ ప్రతినిధితో పాటు ఐసీసీ నైతికత కమిటీ లాయర్ దీనికి హాజరయ్యారు. ఆగస్ట్ 1న విచారణ తర్వాత లూయీస్ 48 గంటల్లోగా తన నివేదికను రాత పూర్వకంగా సమర్పిస్తారు. అవసరమైతే ఆయన శిక్ష కూడా ప్రతిపాదించే అవకాశం ఉంది. మరో వైపు రవీంద్ర జడేజాను మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ విచారిస్తారు. అయితే విచారణ తేదీ ఖరారు కాలేదు.
సంబంధిత వార్తలు