క్వార్టర్స్‌లో జయరామ్ పరాజయం

క్వార్టర్స్‌లో జయరామ్ పరాజయం


సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకై క భారత ప్లేయర్ అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గత ఏడాది రన్నరప్ జయరామ్ 23-25, 13-21తో లీ హున్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు.

 

 తొలి గేమ్‌లో ఒకదశలో జయరామ్ 14-11తో మూడు పాయి0ట్ల ఆధిక్యంలో ఉన్నాడు. కానీ లీ హున్ వెంటనే తేరుకొని స్కోరును సమం చేయడంతోపాటు 20-17తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో గేమ్‌లో లీ హున్ పూర్తి ఆధిపత్యం చలాయి0చి జయరామ్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top