కివీస్పై మనదే ఆధిక్యం

కివీస్పై మనదే ఆధిక్యం


కాన్పూర్: భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టులో తొలి రెండు రోజులు న్యూజిలాండ్దే పైచేయి. తొలి రోజు భారత్ ఇన్నింగ్స్  దెబ్బతీసిన కివీస్.. రెండో రోజు బ్యాటింగ్లో మెరిసింది. అయితే మూడో రోజుకు వచ్చేసరికి న్యూజిలాండ్ పూర్తిగా తేలిపోయింది. 152/1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ను భారత్ చావుదెబ్బ తీసింది. ప్ర ధానంగా భారత స్పిన్నర్లను ఎదుర్కోలేని  న్యూజిలాండ్ మరో 110 పరుగులు మాత్రమే జోడించి మిగతా తొమ్మిది వికెట్లను కోల్పోయింది. రవీంద్ర జడేజా ఐదు, అశ్విన్ నాలుగు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించారు. 





మూడో రోజు ఆటలో లాథమ్(58) రెండో వికెట్ గా అవుటైన తరువాత కివీస్ ఘోరంగా విఫలమైంది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో రాస్ టేలర్ డకౌట్ గా వెనుదిరగగా, కెప్టెన్ విలియమ్సన్(75) బాధ్యతాయుతంగా ఆడాడు. కాగా, ఆ తరువాత ల్యూక్ రోంచీ(38), సాంట్నార్(32), వాట్లింగ్(21) మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. అయితే చివరి మూడు వికెట్లలో ఇద్దరు కివీస్ బ్యాట్స్మెన్లు డకౌట్ గా పెవిలియన్ చేరడంతో కివీస్ 262 పరుగులకే పరిమితమైంది. ప్రస్తుతం భారత జట్టుకు 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో  318 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top