ఇషాంత్పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం
కొలంబో: శ్రీలంకతో మూడో టెస్టులో సూపర్ స్పెల్తో రాణించిన భారత పేసర్ ఇషాంత్ శర్మ దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. లంక క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించినందుకుగాను ఇషాంత్పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం విధించారు. ఐసీసీ ఈ మేరకు ప్రకటించింది.
మూడో టెస్టులో ఇషాంత్ లంక క్రికెటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇషాంత్ ఐసీసీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినట్టు తేలడంతో చర్యలు తీసుకున్నారు. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించి 2-1తో సిరీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.