మంగళగిరిలో సచిన్ 100 ఎకరాలు కొన్నాడా?

మంగళగిరిలో సచిన్ 100 ఎకరాలు కొన్నాడా?

మంగళగిరి: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రియల్టర్ల సర్కిల్ లో ఓ రూమర్ సంచలనం రేపుతోంది. మంగళగిరికి సమీపంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. విజయవాడ-గుంటూరు పట్టణాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడవచ్చనే ఊహాగానాల మధ్య రెండు జిల్లాల్లోనూ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. 

 

మంగళగిరిలో రాజధాని ఏర్పడవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో 100 ఎకరాల భూమిని సచిన్ కొనుగోలు చేసిన అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆగస్టు 1 విజయవాడలో పీవీపీ మాల్ ప్రారంభించడానికి  వస్తున్న అంశాన్ని ఈ రూమర్ కు అక్కడి రియల్టర్లు జత చేస్తున్నారు. అయితే సచిన్ భూమి కొనుగోలు అంశాన్ని చాలా మంది తేలికగా తీసుకుంటున్నారు. భూముల ధర పెంచేందుకే రియల్టర్లు ఇలాంటి చవకబారు ప్రచారానికి పూనుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top