ఐర్లాండ్ లక్ష్యం 412 పరుగులు
కాన్ బెర్రా: హషిమ్ ఆమ్లా, డుప్లెసిస్ శతకాలకు రోసో, మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ జతకావడంతో ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. పసికూన ముందు 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
12 పరుగులకే తొలి వికెట్ నష్టపోయిన సఫారీ టీమ్ ను ఆమ్లా, డుప్లెసిస్ శతకాలతో భారీ స్కోరు బాట పట్టించారు. తమ జట్టు తరపున ప్రపంచకప్ లో రెండో వికెట్ కు వీరిద్దరూ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ తమ తన సహజశైలికి విరుద్దంగా ఆడారు. ఆమ్లా వేగంగా ఆడగా, ప్లెసిస్ ఆచితూచి ఆడాడు. ప్లెసిస్ 109 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో 109 పరుగులు చేశాడు. ఆమ్లా 128 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 159 పరుగులు చేసి అవుటయ్యాడు. డివిలియర్స్ 24 పరుగులు సాధించాడు. ఓపెనర్ డీకాక్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు.
చివర్లో రోసో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశారు. మిల్లర్(46, 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అతడికి తోడుగా నిలిచాడు.