ఐపీఎల్ వచ్చేస్తోంది...
వన్డే క్రికెట్కు కాస్త విరామం... ధనాధన్ దూకుడుకు శ్రీకారం... ఇన్నాళ్లు ప్రపంచకప్లో ప్రత్యర్థులుగా కనిపించిన వారంతా ఇప్పుడు ఒక్కసారిగా హితులు, సన్నిహితులు. ధోని, డు ప్లెసిస్ దోస్తులైపోతే... గేల్, డివిలియర్స్ సామూహిక విధ్వంసానికి పాల్పడతారు. డుమిని, మ్యాథ్యూస్ చెట్టాపట్టాలేసుకుంటే... కోహ్లి, స్టార్క్ సమైక్య రాగం ఆలపిస్తారు. రోహిత్తో ఫించ్, హాజల్వుడ్లకు స్నేహం కుదిరితే... రహానేతో కలిసి వాట్సన్, స్మిత్ వ్యూహాలు పన్నుతారు.
బౌల్ట్తో బౌలింగ్ చేయించే వార్నర్, ధావన్తో జుగల్బందీకి బయల్దేరతాడు. క్రికెట్ అభిమానులకు అత్యంత ప్రియమైన ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది. 47 రోజుల పాటు వీర బాదుడుతో అలరించేందుకు ఆటగాళ్లంతా రెడీ అంటున్నారు. ఏప్రిల్ 8న కోల్కతాలో ఐపీఎల్-8 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతాతో ముంబై తలపడుతుంది. మే 24న ఫైనల్ జరుగుతుంది. ఇక ఫోర్లు, సిక్సర్ల మెరుపులకు మీ సాయం సమయాలు అంకితమిచ్చేందుకు సిద్ధమైపోండి..!
సంబంధిత వార్తలు