చికెన్ సన్రైజర్స్...ఆర్సీబీ పిజ్జా...
దేశమంతా ప్రస్తుతం క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. ప్రతిరోజూ ఐపీఎల్ మ్యాచ్లతో క్రికెట్ అభిమానులకు కావలసినంత సందడి. దీనిని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో పడ్డాయి కోల్కతాలోని రెస్టారెంట్స్. నగరంలోని 80 శాతం రెస్టారెంట్స్లో ఐపీఎల్ సందర్భంగా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
తమ మెనూలను పూర్తిగా మార్చేశారు. గేల్ స్టార్మ్, రోహిత్ రైడర్, మ్యాక్స్వెల్ మిస్త్ పేరుతో ఓ రెస్టారెంట్ మాక్టైల్స్ అందిస్తోంది. ఓ కాఫీషాప్లో చెన్నై సూపర్ బర్గర్, రాయల్ చాలెంజర్స్ పిజ్జా తయారు చేస్తున్నారు. మరో రెస్టారెంట్లో చెన్నై సూపర్ రైస్తో చికెన్ సన్రైజర్స్ను లొట్టలేసుకుని తినేలా తయారు చేస్తున్నారు. మరో చోట ఈడెన్గార్డెన్ రోల్, ఫుల్టాస్ హాట్డాగ్స్ను తమ కస్టమర్లకు వేడిగా సర్వ్ చేస్తున్నారు. మొదట్నించి కూడా మిగిలిన నగరాలతో పోలిస్తే కోల్కతాలో కాస్త ఐపీఎల్ ఫీవర్ ఎక్కువగానే ఉంటుంది. ఈసారి కూడా బెంగాల్లోనే సందడి ఎక్కువగా ఉంది.