జోష్నాకు కాంస్యం
కువైట్ సిటీ: ఆసియా స్క్వాష్ చాంపియన్షిప్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి జోష్నా చిన్నప్ప కాంస్య పతకం సాధించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో జోష్నా 6-11, 9-11, 7-11తో టాప్ సీడ్, ప్రపంచ చాంపియన్ నికోల్ డేవిడ్ (మలేసియా) చేతిలో ఓడిపోయింది.
సెమీఫైనల్ చేరుకున్నవారికి కాంస్య పతకం లభిస్తుంది. సౌరవ్ గోషాల్, దీపిక పళ్లికల్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి పతకం నెగ్గే అవకాశాన్ని కోల్పోయారు.