యూఏఈ జట్టులో భారతీయం
సిడ్నీ: ప్రపంచ కప్లో మనోళ్లు మనతోనే పత్యర్థులుగా తలపడుతున్నారు. యూఏఈ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణ చంద్రన్, స్వప్నిల్ పాటిల్ భారతీయులే. భారత్తో ప్రపంచ కప్ పూల్-బిలో మ్యాచ్లో యూఏఈ జట్టు తరపున వీరిద్దరూ బరిలో దిగారు.
కృష్ణ చంద్రన్ కేరళవాసి కాగా, పాటిల్ మహారాష్ట్రకు చెందినవాడు. వీరిద్దరూ భారత్లో కూడా వారి సొంత రాష్ట్రాల తరపున ఆడారు. ఉద్యోగరీత్యా యూఏఈకి వెళ్లి స్థిరపడ్డారు. క్రికెట్ నేపథ్యం వారికి కలసి వచ్చింది. యూఏఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. 31 ఏళ్ల కృష్ణ చంద్రన్, 30 ఏళ్ల స్వప్పిల్ గతేడాది యూఏఈ జట్టుకు ఎంపికయ్యారు. ఇప్పటి వరకు కృష్ణ చంద్రన్ 8, స్వప్నిల్ ఏడు 7 వన్డేలు ఆడారు. కాగా యూఏఈ జట్టులో ఎక్కువగా ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. భారత్తో పాటు ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, శ్రీలంకకు చెందినవారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూఏఈ జట్టులో ఎక్కువగా పాక్ ఆటగాళ్లున్నారు.