ప్రధాన కోచ్‌గా బంగర్

ప్రధాన కోచ్‌గా బంగర్


జింబాబ్వే పర్యటనకు ఎంపిక ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మ




ముంబై: భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌కు రాబోయే సిరీస్ కోసం ప్రమోషన్ లభించింది. జింబాబ్వేలో పర్యటించే టీమిండియాకు ఆయన ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తారు. భారత్‌కు కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా ఈ సిరీస్ వరకు బంగర్‌కు బీసీసీఐ బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఇప్పటి వరకు పని చేసిన ఆర్.శ్రీధర్‌ను బోర్డు తప్పించింది.





అతని స్థానంలో ఢిల్లీకి చెందిన అభయ్ శర్మను ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. రైల్వేస్‌కు, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కు కోచ్‌గా వ్యవహరించిన అభయ్... భారత అండర్-19, భారత ‘ఎ’ జట్లకు ఇటీవలి వరకు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశారు. జింబాబ్వే పర్యటనకు భారత జట్టు మేనేజర్‌గా కోకా రమేశ్ (ఆంధ్ర)ను ఎంపిక చేశారు. టూర్‌లో ధోని సారథ్యంలోని భారత జట్టు 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది.


 


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top