ఈపీఎల్‌లో భారత ఫుట్‌బాల్ క్రీడాకారిణి

ఈపీఎల్‌లో భారత ఫుట్‌బాల్ క్రీడాకారిణి


లండన్: ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) క్లబ్ వెస్ట్ హామ్ యునెటైడ్ మహిళా ఫుట్‌బాల్ జట్టు భారత క్రీడాకారిణి అదితి చౌహాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇంగ్లండ్‌లోని ఓ టాప్ క్లబ్ తరఫున ఆడనున్న తొలి భారత మహిళా ఫుట్‌బాలర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. 2013లో దక్షిణాసియా టైటిల్‌ను నెగ్గిన భారత జట్టులో గోల్‌కీపర్ అదితి కీలకపాత్ర పోషించింది. ఇంగ్లండ్ మహిళల ఫుట్‌బాల్ వ్యవస్థలో మూడో లెవల్ అయిన మహిళల ప్రీమియర్ లీగ్ సదరన్ డివిజన్‌లో వెస్ట్ హామ్ జట్టు తలపడుతోంది. ఈ ఘనత సాధిం చినందుకు వచ్చిన అభినందనలపై అదితి హర్షం వ్యక్తం చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top