ఆసీస్ పర్యటనకు బయల్దేరిన టీమిండియా

ఆసీస్ పర్యటనకు బయల్దేరిన టీమిండియా


ముంబై:విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ బృందం ఆసీస్ పర్యటనకు బయల్దేరింది. నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా 18 సభ్యుల టీమిండియా శనివారం ఉదయం ఆసీస్ పర్యటనకు పయనమైంది. డిసెంబర్ 4 వ తేదీన బ్రిస్బేన్ లో తొలి టెస్టు జరుగనుంది. మహేంద్ర సింగ్ ధోనికి కుడి చేతి బొటన వ్రేలికి గాయం కావడంతో అతను తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో మొదటి టెస్టు బాధ్యతలను విరాట్ కోహ్లీ తీసుకోనున్నాడు. తొలిటెస్టు ధోనీ దూరం కావడంతో నమాన్ ఓజాకు స్థానం కల్పించారు.


 


తొలిసారి టెస్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఈ సిరీస్ ను తప్పకుండా గెలుస్తామనే ధీమానూ వ్యక్తం చేశాడు. అయితే భార్యకు ఆరోగ్యం బాగాలేనందున ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న కోచ్ డంకన్ ఫ్లెచర్ నేరుగా ఆస్ట్రేలియాలో జట్టుతో కలుస్తారు.


 


టెస్టు మ్యాచ్ షెడ్యూల్


డిసెంబర్ 4-8, తొలి టెస్టు(బ్రిస్బేన్)


డిసెంబర్12-16, రెండో టెస్టు(అడిలైడ్)


డిసెంబర్26-30, మూడో టెస్టు(మెల్ బోర్న్)


జనవరి 3-7, నాల్గో టెస్టు(సిడ్నీ)


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top