భారత్కు 8 పతకాలు
యూఎస్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్
న్యూఢిల్లీ: యూఎస్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో భారత్ దుమ్మురేపింది. లాస్ వేగాస్లో జరిగిన ఈ టోర్నీలో రెండు స్వర్ణాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 8 పతకాలు గెలుచుకుంది.
ముంబై ఆటగాడు కర్ల్ వత్సా ఓ స్వర్ణం, ఓ కాంస్యం గెలుచుకోగా; మహిళల విభాగంలో తోయోషా కటు (ముంబై) ఓ బంగారు పతకం, మూడు కాంస్య పతకాలు సాధించింది. ప్రణయ్ శర్మ (ఢిల్లీ), ఆకాష్ సమీర్ షా (ముంబై) తమ విభాగాల్లో చెరో కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. 15 దేశాల నుంచి 3 వేల మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్ తరఫున ఆరుగురు సభ్యుల బృందం బరిలోకి దిగింది.