భారత్ చేతిలో చైనా చిత్తు
క్వాంటాన్ (మలేసియా): ఆసియా హాకీ చాంపియన్షిప్ ట్రోఫీలో భారత్ సెమీస్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 9-0 స్కోరు తేడాతో చైనాను చిత్తుగా ఓడించింది.
ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు తొమ్మిది గోల్స్ సాధించగా, చైనా కనీసం బోణీ కూడా కొట్టలేకపోయింది. ఈ టోర్నీలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 3-2 స్కోరుతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.