భారత్ కు మరో ఓటమి

భారత్ కు మరో ఓటమి


రాయ్ పూర్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టుకు మరో ఓటమి ఎదురైంది. పూల్' బి' లో భాగంగా ఇక్కడ సోమవారం నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 1-3 తేడాతో పరాజయం చెందింది. దీంతో భారత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింట ఓటమి పాలవ్వగా, ఒక మ్యాచ్ ను డ్రాతో సరిపెట్టుకుంది. తొలి మ్యాచ్ లో సర్ధార్ సింగ్ నాయకత్వంలోని భారత్ ను అర్జెంటీనా ఓడించగా, ఆ తదుపరి జర్మనీతో జరిగిన మ్యాచ్ ను డ్రాగా ముగించింది. దీంతో లీగ్ దశను ఒక్క విజయం లేకుండానే భారత్ ముగించింది.



 

దర్లాండ్స్ తరఫున మింక్ వీర్‌డెన్ (36వ నిమిషంలో), మిర్కో ప్రుసెర్ (43వ నిమిషంలో), బొవెన్‌డీర్ట్ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... భారత్‌కు చింగ్లెన్‌సనా సింగ్ (47వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించాడు. కాగా పూల్ బి లో చివరి స్థానంలో నిలిచిన భారత్.. పూల్ -ఏ టాపర్ తో క్వార్టర్స్ ఆడనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top