కివీస్కు భారీ లక్ష్యం
కాన్పూర్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడ న్యూజిలాండ్ జరుగుతున్న తొలి టెస్టులో భారత 434 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాల్గో రోజు ఆటలో భారత్ తన రెండో ఇన్నింగ్స్ను 377/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 159/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లి సేన అత్యంత నిలకడగా ఆడింది. ఈ రోజు ఆటలో మురళీ విజయ్(76) వికెట్ కోల్పోయిన భారత్.. ఆ తరువాత విరాట్ కోహ్లి(18) వికెట్ ను నష్టపోయింది. ఆపై స్వల్ప వ్యవధిలో చటేశ్వర పూజారా(78) అవుట్ కావడంతో భారత్ కాస్త తడబడినట్లు కనిపించింది.
కాగా, రోహిత్ శర్మ(68 నాటౌట్), అజింక్యా రహానే(40) బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ తిరిగి పుంజుకుంది. ఈ జోడీ ఐదో వికెట్ కు 49 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అనంతరం రోహిత్-రవీంద్ర జడేజాల జోడి 100 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ క్రమంలోనే జడేజా(50 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించిన తరువాత భారత జట్టు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. కివీస్ బౌలర్లలో సాంట్నార్, సోథీలకు తలో వికెట్లు లభించగా, క్రెయిగ్ కు ఒక వికెట్ దక్కింది.
భారత తొలి ఇన్నింగ్స్ 318 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 377/5
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 262 ఆలౌట్