నైనా, శ్రీజలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: పాకిస్థాన్లో జరిగిన దక్షిణాసియా జూనియర్, క్యాడెట్స్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో హైదరాబాద్ క్రీడాకారులు స్వర్ణాలతో మెరిశారు. ఇస్లామాబాద్లోని పాకిస్థాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగిన ఈ టోర్నీలో నైనా జైస్వాల్, ఆకుల శ్రీజలు రెండేసి స్వర్ణాలు సాధించగా, ఆర్.స్నేహిత్ ఓ స్వర్ణం, రజతం సాధించాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్, టీమ్ ఈవెంట్లలో నైనా స్వర్ణాలు గెలవగా... శ్రీజ టీమ్ ఈవెంట్తోపాటు డబుల్స్లో పసిడి పతకాలు సాధించింది. ఇక స్నేహిత్ టీమ్ ఈవెంట్లో స్వర్ణంతోపాటు క్యాడెట్ బాలుర సింగిల్స్లో రజతం దక్కించుకున్నాడు.