టీమిండియా చేతిలో కుక్ సేన చిత్తు

టీమిండియా చేతిలో కుక్ సేన చిత్తు


కార్డిఫ్: టెస్టుల్లో పరాజయానికి ఇంగ్లండ్ పై టీమిండియా బదులు తీర్చుకుంది. లార్డ్స్ లో విజయం తర్వాత ఇంగ్లీషు గడ్డపై ధోని సేన మళ్లీ గెలుపు సాధించింది. రెండో వన్డేలో కుక్ సేనను చిత్తుగా ఓడించింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ పై 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 295 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటయింది. హేల్స్(40) టాప్  స్కోరర్ గా నిలిచాడు.



వర్షం కారణంగా ఇంగ్లండ్ లక్ష్యాన్ని డీఎల్ఎఫ్ ప్రకారం 47 ఓవర్లలో 295 పరుగులుగా నిర్దేశించారు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టాడు. షమీ, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, రైనా చెరో వికెట్ దక్కించుకున్నారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top