ఇంగ్లండ్తో మూడో టెస్టు: బ్యాటింగ్ దిగిన భారత్


సౌతాంప్టన్: ఇంగ్లండ్తో మూడో టెస్టులో మూడో రోజు మంగళవారం భారత్ తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. 25/1 ఓవర్నైట్ స్కోరుతో ధోనీసేన బ్యాటింగ్కు దిగింది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ మురళీవిజయ్ (11), పుజారా (4) క్రీజులోకి వచ్చారు. రెండో రోజు టీమిండియా ఓపెనర్ ధవన్ 6 పరుగులకే అవుటయ్యాడు.



ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 569/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 544 పరుగులు వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ పైచేయి సాధించిన ఈ మ్యాచ్లో భారత్కు డ్రా చేసుకోవడం మినహా విజయావకాశాలు దాదాపుగా లేనట్టే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top