భారత్, జపాన్ మ్యాచ్ డ్రా


భువనేశ్వర్ : జపాన్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత హాకీ జట్టు డ్రాతో ప్రారంభించింది. పేలవ డిఫెన్స్ ఆటతీరుతో పలు అవకాశాలను వృథా చేసుకున్న సర్దార్ సింగ్ సేన ఆదివారం జరిగిన తొలి టెస్టును 1-1తో ముగించింది. జపాన్ తరఫున కురోగవా ైడె చీ (19వ ని.లో), భారత్ తరఫున రఘునాథ్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌తో భారత ప్లేయర్ కొతాజిత్ సింగ్ కెరీర్‌లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top