భారత్, ఇంగ్లండ్ యూత్ టెస్టు డ్రా
నాగ్పూర్: భారత్, ఇంగ్లండ్ అండర్–19 జట్ల మధ్య జరిగిన రెండో యూత్ టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్ల ఈ సిరీస్ కూడా 0–0తో ‘డ్రా’ అయింది.
ఓవర్నైట్ స్కోరు 34/2తో చివరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో మ్యాచ్ ముగిసే సమయానికి 82 ఓవర్లలో 255 పరుగుల వద్ద ఆలౌటైంది. బర్ట్లెట్ (76; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో హర్ష్ త్యాగి (4/67) రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 375 పరుగులు చేయగా, భారత్ 388 పరుగులు చేసింది.