408 పరుగులకు భారత్ ఆలౌట్
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బ్రిస్బేన్ టెస్ట్ రెండో రోజు ఆట లంచ్లోపే భారత్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. 311/4 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ జట్టు 408 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొత్తంగా 97 పరుగులకు చివరి ఆరు వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది.. రోహిత్ శర్మ 32, కెప్టెన్ ధోనీ 33, అశ్విన్ 35 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజల్వుడ్ అయిదు వికెట్లు, స్పిన్నర్ లియాన్ మూడు వికెట్లు తీశారు.
సంబంధిత వార్తలు