భారత్ ‘ఎ’ మరో విజయం


 డార్విన్: కేదార్ జాదవ్ (53 బంతుల్లో 87; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజూ శామ్సన్ (80 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు) చెలరేగడంతో నాలుగు దేశాల సిరీస్‌లో భారత్-ఎ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గార్డెన్స్ ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఎన్‌పీఎస్ (నేషనల్ పెర్ఫార్మెన్స్ స్క్వాడ్)పై గెలిచింది.

 

 టాస్ గెలిచి భారత్-ఎ ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన ఎన్‌పీఎస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 234 పరుగులు చేసింది. టర్నర్ (89 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్సర్), సిల్క్ (87 బంతుల్లో 67; 5 ఫోర్లు) అబాట్ (39 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించారు. శుక్లా, రిషీ ధావన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ 39.5 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. 63 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాను జాదవ్, శామ్సన్ ఆరో వికెట్‌కు 112 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. మురిహెడ్ 4, అబాట్ 2 వికెట్లు పడగొట్టారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top