ఇందర్జీత్, జాన్సన్లకు స్వర్ణాలు
చాంతబురి (థాయ్లాండ్): ఆసియా అథ్లెటిక్స్ గ్రాండ్ప్రి సిరీస్లోని చివరి మీట్లోనూ భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. సోమవారం జరిగిన ఈ మీట్లో భారత్కు ఎనిమిది పతకాలు వచ్చాయి. ఇందర్జీత్ సింగ్ (షాట్పుట్), జిన్సన్ జాన్సన్ (800 మీటర్లు), దేవేందర్ సింగ్ (జావెలిన్ త్రో) స్వర్ణ పతకాలు సాధించారు. ఇందర్జీత్, జాన్సన్లకు వరుసగా ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం. బ్యాంకాక్, పతుమ్థానిలలో జరిగిన గ్రాండ్ప్రి సిరీస్లలోనూ వీరిద్దరు స్వర్ణాలు నెగ్గారు. అంకిత్ శర్మ (లాంగ్జంప్), రాజీవ్ (400 మీటర్లు), పూవమ్మ (400 మీటర్లు), గాయత్రి (100 మీటర్ల హర్డిల్స్) రజత పతకాలు సాధించారు. మహిళల 4ఁ100 మీటర్ల రిలేలో భారత్కు కాంస్యం దక్కింది.