ఫైనల్లో ఓడిన జోష్న
హాంకాంగ్: భారత స్క్వాష్ స్టార్ జోష్న చిన్నప్ప హాంకాంగ్ పీఎస్ఏ హెచ్కేఎఫ్సీ అంతర్జాతీయ టోర్నమెంట్ ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో జోలీ కింగ్ (న్యూజిలాండ్) 11-9, 11-9, 9-11, 11-9 తో జోష్నపై గెలిచింది. తొలి గేమ్లో 9-8తో జోష్న ఆధిక్యంలో ఉన్నా ప్రత్యర్థి వరుసగా మూడు పాయింట్లు సాధించి నెగ్గింది.
మూడో గేమ్లో జోష్న పూర్తి ఆధిపత్యం చూపినా కీలక గేమ్లో మాత్రం చేతులెత్తేసింది. గతంలో వీరిద్దరు ఎనిమిది సార్లు తలపడగా ఒక్కసారి (2009) మాత్రమే జోష్న నెగ్గింది.