సెమీస్‌లో జోష్న, మహేశ్


- విక్టోరియా ఓపెన్ స్క్వాష్

మెల్‌బోర్న్:
భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్న చినప్ప విక్టోరియా ఓపెన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌లో మూడో సీడ్ జోష్న 11-6, 11-4, 8-11, 11-9తో మేగన్ క్రెయిగ్ (న్యూజిలాండ్)పై గెలిచింది. ఇదే టోర్నీ పురుషుల విభాగం క్వార్టర్స్‌లో మహేశ్ మంగావ్‌కర్ 13-15, 12-10, 11-8, 11-7తో హేకాక్స్ (ఇంగ్లండ్)పై గెలిచాడు. మరో క్వార్టర్స్‌లో భారత క్రీడాకారుడు కుశ్ కుమార్ 5-11, 7-11, 9-11తో ఫింటిసిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top