లలిత్ మోదీ లేఖ నిజమే: ఐసీసీ

లలిత్ మోదీ లేఖ నిజమే: ఐసీసీ


దుబాయ్: ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లకు రియట్ ఎస్టేట్ దిగ్గజం భారీగా లంచం ఇచ్చినట్టు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తమకు లేఖ రాసింది నిజమేనని ఐసీసీ ధృవీకరించింది. ఈ వ్యవహారంపై మోదీ శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ముడుపులు అందుకున్న వారిలో ఇద్దరు భారత్, ఒకరు విండీస్ ఆటగాడున్నట్టు ఆయన చెప్పారు. ‘మోదీ మాకు జూన్ 2013లో ఈ-మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఆ సమయంలోనే దీన్ని ఏసీఎస్‌యూకు తెలిపాం. వారు బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్‌కు కూడా పంపారు’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు మోదీ లేఖపై ఐసీసీ వివరణ ఇవ్వాల్సిన అవసరముందని బీహార్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆదిత్య వర్మ డిమాండ్ చేశారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top