హైదరాబాద్ లక్ష్యం 158
ముంబై: ఐపీఎల్-8లో భాగంగా శనివారం ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 158 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్కు నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
ముంబై ఓపెనర్ సిమన్స్ (42 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్తో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. పొలార్డ్ 33, రోహిత్ శర్మ 24, పార్థివ్ పటేల్ 17 పరుగులు చేశారు. కాగా తెలుగుతేజం అంబటి రాయుడు 7 పరుగులకే వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ మూడు, స్టెయిన్, ప్రవీణ్ చెరో రెండు వికెట్లు తీశారు.