ఎట్టకేలకు ఢిల్లీ విజయం
హాకీ ఇండియా లీగ్
న్యూఢిల్లీ : వరుసగా నాలుగు పరాజయాల అనంతరం ఢిల్లీ వేవ్రైడర్స్ ఓ విజయాన్ని అందుకుంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ను 7-4 తేడాతో ఢిల్లీ కంగుతినిపించింది. ఏడో నిమిషంలోనే ఢిల్లీకి మన్దీప్ సింగ్ ఫీల్డ్ గోల్తో 2-0 ఆధిక్యం అందించాడు. ఇదే రీతిన ఎదురుదాడులు కొనసాగించిన ఢిల్లీకి 13వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను తల్వీందర్ సింగ్ గోల్గా మలిచాడు. తిరిగి 19వ నిమిషంలో తల్వీందర్ ఫీల్డ్ గోల్ చేయడంతో ఢిల్లీ 5-0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 35వ నిమిషంలో రాంచీ రేస్ కెప్టెన్ అష్లే జాక్సన్ ఫీల్డ్ గోల్తో ఆధిక్యం 5-2కి తగ్గింది. అయినా 42వ నిమిషంలో మన్దీప్ సింగ్ మరో ఫీల్డ్ గోల్ చేయడంతో స్కోరు 7-2కి పెరిగింది. 50వ నిమిషంలో రాంచీకి ట్రెంట్ మిట్టన్ ఫీల్డ్ గోల్ చేసి ఆధిక్యాన్ని తగ్గించినా ఫలితం దక్కలేద