హరీందర్ ‘హ్యాట్రిక్'... దీపిక ‘డబుల్'

హరీందర్ ‘హ్యాట్రిక్'... దీపిక ‘డబుల్'


చెన్నై: స్వదేశంలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ... జేఎస్‌డబ్ల్యూ ఇండియన్ సర్క్యూట్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్స్ హరీందర్ పాల్ సంధూ, దీపిక పళ్లికల్ విజేతలుగా నిలిచారు. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో హరీందర్... మహిళల సింగిల్స్‌లో దీపిక చాంపియన్స్‌గా అవతరించారు.



ఇండియన్ సర్క్యూ ట్‌లో హరీందర్‌కిది ‘హ్యాట్రిక్’ టైటిల్ కాగా... దీపికకు వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. ఫైనల్స్‌లో దీపిక 11-6, 11-2, 11-8తో మిసాకి కొబయాషి (జపాన్)పై గెలుపొందగా... హరీందర్ 11-8, 11-3, 11-6తో టాప్ సీడ్ కరీమ్ అలీ ఫతీ (ఈజిప్టు)ను బోల్తా కొట్టించాడు. ఇంతకుముందు హరీందర్ జైపూర్, ముంబైలలో జరిగిన టోర్నీల్లోనూ టైటిల్ సాధించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top