ఏపీఎఫ్ఏ బాధ్యతలు అప్పగించండి
ఫుట్బాల్ సంఘం కార్యదర్శి డిమాండ్
బంజారాహిల్స్, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్కు జరిగిన ఎన్నికలు సక్రమమేనంటూ 25వ అడిషనల్ చీఫ్ జడ్జి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అసోసియేషన్ నిర్వహణ బాధ్యతలు వెంటనే తమకు అప్పగించాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవాబ్ అనీస్ ఉల్ ముల్క్ కోరారు.
బుధవారం బంజారాహిల్స్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.గోవిందరావు, హబీబ్ అలీ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. గత ఏడాది మే 15న ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం నిర్వహించిన ఎన్నికలు అసోసియేషన్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తీర్పు ఇచ్చినప్పటికీ ఇంత వరకు నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగించలేదని ఆయన అన్నారు. వెంటనే‘ శాప్’ మేనేజింగ్ డెరైక్టర్ స్పందించి అసోసియేషన్ కార్యాలయాన్ని తమకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గులాం జిలానీ, సయ్యద్ అఫ్సర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.