హరికృష్ణ పరాజయం


న్యూఢిల్లీ: షెన్‌జెన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పెంటేల హరికృష్ణకు తొలి పరాజయం ఎదురైంది. టాప్‌ సీడ్‌ అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌)తో జరిగిన మూడో రౌండ్‌లో ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ 56 ఎత్తుల్లో ఓడిపోయాడు. మూడో రౌండ్‌ తర్వాత హరికృష్ణ 1.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే నాలుగో రౌండ్‌ గేమ్‌లో యు యాంగి (చైనా)తో హరికృష్ణ ఆడతాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top