పాక్ 452 ఆలౌట్
అబుదాబి:వెస్టిండీస్తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్ ను 452 పరుగుల వద్ద ముగించింది. 304/4 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్ మరో 148 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. ఈరోజు ఆటలో ఓవర్ నైట్ ఆటగాడు మిస్బావుల్ హక్(96) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. వెస్టిండీస్ బౌలర్ గాబ్రియెల్ వేసిన బంతికి మిస్బా వికెట్ల ముందు దొరికిపోయాడు.
అనంతరం సర్ఫరాజ్ అహ్మద్(56) హాఫ్ సెంచరీతో రాణించగా, సొహైల్ ఖాన్(26), మహ్మద్ నవాజ్(25)లు ఫర్వాలేదనిపించారు. వెస్టిండీస్ బౌలర్లలో గాబ్రియెల్ ఐదు వికెట్లతో సత్తాచాటగా, హోల్డర్ మూడు వికెట్లు సాధించాడు.