ఐపీటీఎల్‌లో ఫెడరర్

ఐపీటీఎల్‌లో ఫెడరర్


న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) బరిలోకి దిగనున్నాడు. మైక్రోమ్యాక్స్ ‘ఇండియన్ ఏసెస్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. మణికట్టు గాయంతో నాదల్ ఈ టోర్నీ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో ఫెడరర్‌ను తీసుకున్నారు. ఇండియన్ ఏసెస్ జట్టు తరఫున సంప్రాస్,  ఇవనోవిచ్, మోన్‌ఫిల్స్, సానియా, బోపన్నలు బరిలోకి దిగనున్నారు.  సాంటారో రిజర్వ్ ప్లేయర్. ‘నమస్తే భారత్! తొలిసారి న్యూఢిల్లీకి రావడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఫెడరర్ అన్నాడు. మనీలాలో నవంబర్ 28న ప్రారంభమయ్యే ఈ టోర్నీ డిసెంబర్ 13న దుబాయ్‌లో ముగుస్తుంది. ఢిల్లీలో డిసెంబర్ 6 నుంచి 8 వరకు పోటీలు జరుగుతాయి.







 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top